నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న భారీ పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ.. తన నటించిన ఎన్నో సినిమాలు తో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ హీట్లతో కొనసాగుతున్నాడు బాలయ్య. ఇక ప్రస్తుతం బాలయ్య.. కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి ఇప్పటివరకు ఎటువంటి టైటిల్ కారారు కాలేదు.
దీంతో ఎన్బికె రన్నింగ్ టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన కొద్ది రోజుల నుంచి.. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. తర్వాత ఈ సినిమాలో ఊర్వశి రౌతెలా కూడా నటిస్తుందని.. ఈ అమ్మడు హీరోయిన్గా కాకుండా ఒక కీలక పాత్రలో కనిపిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో ఊర్వశి రౌతెలతో పాటు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, శ్రధ్ధ శ్రీనాథ్ కూడా బాలయ్య సరసన హీరోయిన్లుగానే కనిపించనున్నారని సమాచారం.
ఇక బాలకృష్ణ గతంలో నటించిన ఎన్నో సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించి మెప్పించాడు. చాలా కాలం తర్వాత మరోసారి బాలయ్య ముగ్గురు హీరోయిన్లతో స్క్రీన్ పైన కనిపించడంతో అభిమానుల్లో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కాగా ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉండడానికి కారణం బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించడమే అని తెలుస్తుంది. మూడు డిఫరెంట్ షేడ్స్లో బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. అలా ఈ మూడు డిఫరెంట్ షేడ్స్ కోసం ముగ్గురు హీరోయిన్స్ జంటగా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం వరుస సక్సెస్లతో.. ఫుల్ స్వింగ్లో ఉన్న బాలయ్య.. ఎన్బికె 109 సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు తమ ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.