శ్రీదేవి, సౌందర్య, దివ్యభారతి అందరి లైఫ్ లో విషాదం.. కామన్ పాయింట్ గమనించారా.. ఆ హీరోలతో అలా..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోయిన అలనాటి స్టార్ నటీమణులు ఎంతోమంది అకాల మరణం చెంది అభిమానులను శోఖ సముద్రంలో ముంచేశారు. అలాంటి వారి లిస్ట్‌లోకి సౌందర్య, దివ్యభారతి, ఆర్తి అగర్వాల్, శ్రీదేవి కూడా వస్తారు. శ్రీదేవి కెరీర్ ముగిసిన తర్వాత మరణించినా.. ఆమెది కూడా విషాదకరమరణమే అన్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల విషయంలో ఎన్నో విషయాలు.. ఎప్పటికప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.

స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించిన ఎంతో మంది హీరోయిన్ల స‌డ‌న్ డెత్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్. అలా మరణించిన సౌందర్య, దివభారతి, ఆర్తి అగర్వాల్, శ్రీదేవి విషయంలో వారికి కామన్‌గా జరిగిన ఒక అంశాన్ని చాలామంది గమనించి ఉండరు.. అవేంటో ఒకసారి చూద్దాం. అలనాటి అందాల తార సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మ‌ర‌ణించ‌గా.. దివ్యభారతి మృతి కూడా విషాదకరంగానే జరిగింది. ఇప్పటికీ ఆ మిస్టరీ వీడలేదు. ఆమె మరణం పై ఎన్నో పుకార్లు ఉన్నాయి. ఆర్తి అగర్వాల్ కూడా బరువు తగ్గడం కోసం చేయించుకున్న ట్రీట్మెంట్ ఫెయిల్ కావడంతో చనిపోయారు. ఇక శ్రీదేవి మరణం కూడా విషాదకరమే. ఆమె చావు మిస్టరీ కూడా ఇప్పటికీ వీడలేదు. దుబాయిలో బాత్రూంలో కాలుజారి మరణించిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఈ నలుగురు సీని కెరీర్‌లో కామన్‌గా ఉన్న ఫ్యాక్టరీ ఏంటంటే.. వీళ్ళు చిరంజీవి, వెంకటేష్ లతో కలిసి నటించారు. శ్రీదేవి, ఆర్తి అగర్వాల్, సౌందర్య, దివ్యభారతి, చిరంజీవితో కలిసి సినిమాల్లో కనిపించారు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ కూడా ఈ నలుగురు హీరోయిన్లతో నటించాడు. దివ్యభారతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందే వెంకీ బ్లాక్ బ‌స్టర్ సినిమా బొబ్బిలి రాజధానితో.. ఇక శ్రీదేవి.. వెంకటేష్ తో క్షణక్షణం అనే సినిమాలో నటించారు. సౌందర్య, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో వెంకటేష్ ఎన్నో సినిమాల్లో కనిపించి మెప్పించాడు. అలాగే చిరంజీవితోను ఈ నలుగురు హీరోయిన్స్ కలిసి సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు.