సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ సినిమాలతోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వస్తుందా.. అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో నటించే స్టార్స్ గురించి.. ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వైరల్ గా మారాయి. ఇందుకోసం మహేష్ ఆల్రెడీ మేకోవర్ కూడా ప్రారంభించేశాడు.
కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా ఇండియాలోనే హైయెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఇక మహేష్ నుంచి గుంటూరు కారం సినిమా రిలీజై చాలా కాలం అయినా.. ఇప్పటివరకు రాజమౌళి సినిమా షూట్ ప్రారంభించలేదు. ఆగస్టులో అంటూ మొదట వార్తలు వచ్చినా.. సెప్టెంబర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పటివరకు సినిమా షూట్ ప్రారంభం పనులు కూడా మొదలుపెట్టలేదు. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందో అంటూ అభిమానులకు చర్చ మొదలైంది. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హాలీవుడ్ ఫేవరెట్ గా మారిన రాజమౌళి ఈసారి నేరుగా హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడని.. అందుకే ఆలస్యమవుతుందంటూ తెలుస్తోంది.
గత కొద్దికాలం గా అదిగో అనౌన్స్మెంట్ వచ్చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వినిపిస్తున్న.. సినిమా డిలే అవ్వడానికి అసలు కారణం మాత్రం ఇదేనంటూ వార్త వైరల్ అవుతుంది. గతంలో జక్కన్న కొన్ని హాలీవుడ్ సంస్థలతో టై అప్ అయ్యాడట. అది హాలీవుడ్ యాక్టర్స్ ను ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయడం కోసమేనని సమాచారం. కానీ.. ఇప్పుడు ఈ సినిమా ప్రొడక్షన్ లో కూడా ఓ హాలీవుడ్ సంస్థను భాగం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలోనే జక్కన్న హాలీవుడ్ నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చేస్తే సినిమా ప్రారంభించవచ్చని ఎదురు చూస్తున్నాడట. ఇదే నిజమైతే ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్తో రూపొందుతుంది అనడంలో సందేహం లేదు. మహేష్ తో జక్కన్న ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా దాదాపు 10 ఏళ్ల క్రితమే లాక్ చేయబడిందని.. అది జక్కన్న మైండ్ లో ఎప్పుడు నుంచో ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ గరుడనే ఈ అని వార్తలు వినిపిస్తున్నాయి.