ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు కొల్లగొట్టి దూసుకుపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా తన సత్తా చాటుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ విన్నా.. నాగ్ అశ్విన్ పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ ప్రముఖులు కూడా అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. మహాభారతంలో పాత్రలు భవిష్యత్తు ప్రపంచాన్ని కల్కి రాకతో ముడిపెట్టి సరికొత్త కదా అంశాన్ని తీర్చిదిద్దాడు అశ్విన్.
మైథాలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ విజువల్స్తో రూపొంది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో భైరవ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక బైరవ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఆపాదించినా అమితాబ్ పోషించిన అశ్వద్ధామ రోల్ సినిమాకు హైలెట్గా నిలిచింది. భైరవ, అశ్వద్ధామ కాంబోలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఇక కమల్హాసన్, దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 తర్వాత మల్లి కల్కి తోనే ప్రభాస్ ఆరేంజ్ సక్సెస్ అందుకున్నాడు. ఇక పాన్ ఇండియా హీరోగా ప్రస్తుతం రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్న డార్లింగ్.. కల్కి తర్వాత సినిమా రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాట్లు వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇంకా రెమ్యునరేషన్ పెంచేస్తాడని టాక్కు.. చెక్ పెడుతూ దానికి భిన్నంగా రెమ్యూనరేషన్ బాగా తగ్గించాడు ప్రభాస్. రాజాసాబ్ సినిమాకు రూ.100 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక గతంలో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాకు ప్రొడ్యూసర్గ వ్యవహరించిన టీ.జీ. విశ్వప్రసాద్ ప్రస్తుతం నటిస్తున్న రాజాసాబ్ సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్తో నష్టపోయిన నిర్మతకు ఈ మూవీ విషయంలో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.