పవన్ ఫ్యాన్స్ తో గొడవ పెట్టుకున్న కుర్చీ తాత… వారం రోజులుగా మిస్సింగ్.. పాపం వదిలేయండి రా..!

సోషల్ మీడియా వేదికగా చాలామంది ఫేమస్ అవుతూ ఉంటారు. వారిలో మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా ఒకడు. హైదరాబాద్ రహమత్ నగర్ కు చెందిన మహ్మద్.. ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో హమాలీగా పని చేసేవాడు. అయితే.. ఒకానొక సమయంలో ఓ వీడియోలో ఆయన ” ఆ కుర్చీ మడత పెట్టి ” అని డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యాడు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారి దాన్నే జీవనాధారంగా ఎంచుకుని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూస్ ఇస్తూ.. ప్రమోషన్లు చేస్తూ సంపాదిస్తున్నాడు.

ఇక ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు.. అక్కడే ఉన్న కొందరు పవన్ అభిమానులు ఈనపై ఫైర్ అయ్యారు. నీకు జగన్ అంటే ఇష్టం ఉంటే ఆయన్ని పొగుడుకో… అంతేకానీ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడకు అంటూ సీరియస్ అయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ సైతం అయింది. ఇక ఈ గొడవ తర్వాత ఈయన ఇంటికి వెళ్లడం మానేశాడట.

సుమారు 7 రోజులు పాటు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఆచూకీ తెలపాలని కోరారు. ఈ వీడియో చూసిన కొందరు.. కుర్చీ తాత వరంగల్ రైల్వే స్టేషన్ లో ఉన్నారని.. అక్కడే ఎవరైనా పెట్టింది తిని నిద్రపోతున్నారని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారట. ఈ మేరకు కుటుంబ సభ్యులు తాజాగా అతనిని ఇంటికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇక అదే విధంగా మహేష్ బాబు ” గుంటూరు కారం ” లో కూడా ఆ కుర్చీ మడత పెట్టి అనే డైలాగులు పాటగా సిద్ధం చేయడం ప్రస్తుతం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక దీని ద్వారా ఈ కుర్చీ తాత‌ మరింత ఫేమస్ అయ్యాడు కూడా.