18 ఏళ్ల‌కే పెళ్లి ముగ్గురు పిల్ల‌లు… భ‌ర్త టార్చ‌ర్‌తో విడాకులు… స్టార్ హీరోయిన్ క‌న్నీళ్ల క‌ష్టాలు..!

సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిది కలర్ ఫుల్ లైఫ్, వాళ్లకి కష్టాలు అనేవే ఉండవు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ విషాదం. వాళ్లు సక్సెస్ అయితే నో.. లేదా సక్సెస్ అయ్యి ఫీడ్ అవుట్ అయితేనో ఇలాంటి విభేదాలు బయటకు రావు. ఈ కోవలోకే వస్తుంది నటి సులక్షణ. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది.

అయితే ఈమెకి చిన్న వయసులోనే పెళ్లి జరగడం, తరువాత పిల్లలు పుట్టడం వంటి కారణాలతో సినిమాలకు దూరమైంది. ఇక అనంతరం ఏవో మనస్పార్ధల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని.. మళ్లీ వెండితెరపై ప్రత్యక్షమైంది. ఇక ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…” 18 ఏళ్లకే నా పెళ్లయింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎస్. విశ్వనాథన్ కొడుకు గోపికృష్ణన్ ని నేను పెళ్లి చేసుకున్నాను. మాకు ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. కానీ మా మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయాము. అందుకే 23 ఏళ్ల వయసులోనే విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకోలేదు.

ఆ ఆలోచన కూడా నాకు రాలేదు. అయితే విడాకులు తీసుకునే రోజున కోర్టులో గుక్క పెట్టి ఏడ్చాను. ఎందుకంటే ఆ టైంలో సర్వస్వం కోల్పోయినట్లు అనిపించింది. విడాకుల తర్వాత నా పిల్లలకి అన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది. భరణం అడగమని.. అది పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది అని మా లాయర్ నాకు చెప్పారు. కానీ నా కష్టంపై నేను బ్రతక గలను అని చెప్పి వద్దన్నాను. పిల్లల కోసమే తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను ” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సులక్షణ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.