బిగ్బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసింది. ఈ ఆదివారంతో ఈ సీజన్ పూర్తి కానుంది. ఫైనల్ రేసులో టైటిల్ ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక హౌస్లోకి అడుగుపెట్టిన 19 మందిలో కేవలం ఇప్పుడు 6 హౌస్ మేట్స్ మాత్రమే మిగిలారు. అయితే గ్రాండ్ ఫినాలే టైమ్కి ఎప్పుడూ అయిదుగురు కంటెస్టెంట్ మాత్రమే వెళ్తారు. దీంతో మిడ్ వీక్ లోనే ఓ కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేశారట. అయితే మిడ్వీక్ ఎలిమినేషన్లో భాగంగా స్ట్రాంగ్ కంటిస్టేంట్స్ బయటకు వెళ్లబోతున్నారని టాక్ వినిపిస్తుంది.
బిగ్ బాస్ విన్నర్ టైటిల్ కోసం ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అందులో మొదటి పల్లవి ప్రశాంత్, తర్వాత అమర్, శివాజీ ఉన్నారు. ఈ ముగ్గురు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. బీభత్సమైన వోటింగ్తో దూసుకుపోతున్నారు. కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తప్పక బిగ్బాస్ విన్నర్గా నిలుస్తారు. ఇక మిగిలింది ప్రియాంక, యావర్, అర్జున్. వీరిలో ప్రియాంక, యావర్ మొదటి నుంచి హౌస్ లో ఉన్నారు. అలాగే టాస్క్లను బాగా కూడా ఆడుతున్నారు. అర్జున్ టాస్కులు చాలా బాగా ఆడినా అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మధ్యలో హౌస్ లోకి అడుగుపెట్టాడు.
అలాగే శివాజీ దగ్గర అమర్ గురించి, అమర్ దగ్గర శివాజీ గురించి నెగిటీవ్గా మాట్లాడుతూ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఆడియన్స్ లో అతనిపై నెగెటివిటీ ఉంది. ఈ విధంగా చూసుకుంటే అర్జున్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇటీవల ప్రిన్స్ యావర్ కూడా ఓటింగ్ లో వెనకబడ్డాడు. దీంతో యావర్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ యావర్ ఈ మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయితే హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెంట్ ఎలిమినేట్ అయినట్లే అవుతుంది.