మ‌హేష్‌ను చూడ‌గానే టెన్ష‌న్‌.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కొచ్చి ఏం చేశారంటే.. మీనాక్షి చౌద‌రి సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌..!!

మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ కి సిద్ధమైన ఈ మూవీ.. సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక పూజ హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపిక కాగా.. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ల జాబితాలో ఈ ముద్దుగుమ్మ చేరుతుందని భావిస్తుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి.. మహేష్ పై కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ…” మహేష్ గారు సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. నేను గుంటూరు కారం సెట్ లోకి వచ్చిన మొదటి రోజు టెన్షన్ పడ్డాను.

ఫస్ట్ షూట్ లోనే మహేష్ తో కలిసి పని చేశాను. ఆ సమయంలో నేను కంగారు పడడంతో మహేష్… టెన్షన్ పడవద్దు కొంచెం టైం తీసుకో.. అని తెలిపాడు. ఇక ఏం కాదని చాలా కూల్ గా నాకు చెప్పారు “… అంటూ మీనాక్షి చౌదరి కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.