మహేష్ ” గుంటూరు కారం ” లోని “కుర్చీ మడత పెట్టి” ప్రోమోపై నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ మసాలా ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక జనవరి 12న గ్రాండ్గా ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీ లో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే.

అలాగే ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ అయిన మూడవ సాంగ్ ” కూర్చి మడతపెట్టి ” ప్రోమోని నిన్న ఉదయం రిలీజ్ చేశారు మేకర్స్. ఇక పలుచోట్ల కొందరు సాంగ్ పై విమర్శలు వర్షం కురిపిస్తుండగా.. కొద్దిసేపటి క్రితం నిర్మాత నాగ వంశీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. ” మేము ప్రోమో గురించి చాలా అభిప్రాయాలను విన్నాము. కొంతమంది సాహిత్యం మరియు కొన్ని పదాల వినియోగం గురించి మమ్మల్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

మన సూపర్ స్టార్ మహేష్ గారు జస్ట్ చైర్ ఫోల్డ్ చేసి డాన్స్ చేశారు అంతే అందరూ పాజిటివ్ గా ఆలోచించండి. గుంటూరు కారం అనేది మాస్ అండ్ ఫ్యామిలీ మరియు యూత్ అనే అన్ని వర్గాలను సంతోషపరిచే మంచి అండ్టైనర్ మూవీ. ఆ ఎంటర్టైనర్ తో కూడిన సాంగ్ ఏ ఇది కూడా. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12వ తేదీ అభిమానులకి మరియు సినీ ప్రేమికులకు ఇది భారీ మాస్ ఫిస్ట్ అవుతుంది ” అంటూ నాగ వంశీ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.