మహేష్ కాదు.. నా పేరెంట్స్ తర్వాత తనే నా సొంత మనిషి అనుకున్న.. నమ్రత శిరోద్క‌ర్

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు వారి భార్యలు కూడా అదే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటున్నారు.. అలా హీరోకి సమానంగా క్రేజ్ సంపాదించుకున్న వారిలో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఒకరు. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన న‌మ్ర‌త‌.. తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకుంటుంది. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే సామెత న‌మ్ర‌తకు బాగా సూట్ అవుతుంది.

ఆమె ఈ స్టేజ్‌లో ఉన్న కూడా కొంచం కూడా గర్వం కనిపించదు. కుటుంబం, పిల్లల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా తన పనిమనిషి శాలిని కొండ్రాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. పిల్లలతో కలిసి ఆమె బర్త్డే చేసిన వీడియోను పంచుకున్న నమ్రత.. శాలిని కొండ్ర గత కొన్ని తరాలుగా మాకోసం పనిచేస్తుంది.

నా తల్లిదండ్రుల తర్వాత తననే నా సొంత మనిషిగా భావించా.. ఆమె మాతో కలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఎంత గొప్పగా వర్ణించింది. ఇక నమ్రత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పనిమనిషిని కూడా సొంత మనిషిలా చూసుకునే అంత గొప్ప మనసు మీకు ఉండడం మహేష్ అదృష్టం.. సితార, గౌతమ్‌ కూడా మీలాంటి అమ్మ ఉన్నందుకు చాలా లక్కీ అంటూ.. మీది చాలా గొప్ప మనసు అంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.