మహేష్ ” గుంటూరు కారం ” ఆ ఏరియా టికెట్ బుకింగ్స్ ఓపెన్… ఇక పూనకాలేగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా దీనికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవలే గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.

ఇక అసలు మేటర్ ఏమిటంటే… కొద్దిసేపటి క్రితం ఈ మూవీకి సంబంధించి యూకే లోని కొన్ని థియేటర్స్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. కేవలం కొద్దిసేపటిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక రాబోయే మరికొద్ది రోజుల్లో యూఎస్ లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా బుకింగ్ ఓపెన్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ అన్ని కార్యక్రమాలు ముగించుకుని జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమైంది.