ఆ క్రేజీ హీరోతో కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. హరికృష్ణ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్‌రామ్ మొదట్లో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాకపోవడంతో.. ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్నాడు. ఇక బింబిసారా సినిమాతో తాజాగా రీఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే తర్వాత వచ్చిన ఆమెగోస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తాజాగా డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది.

ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌రామ్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ ఇష్క్ కాదల్‌ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ సాదినేని.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అయితే తర్వాత చేసిన సినిమాలు సరైన సక్సెస్ అందుకోలేదు. అయినా ఇప్పటికి తెలుగు వెబ్ సిరీస్ ద్వారా తన సత్తా చాటుతున్న పవన్ సాదినేని.. సేనాపతి మూవీ తో పాటు జెడితో చేసిన దయ సిరీస్ కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక తాజాగా ప‌వ‌న్‌కి కూడా అవకాశాలు వస్తున్నాయని టాక్‌. కల్యాణ్ రామ్ కోసం పవన్ సాదినేని ఓ స్టోరీని రెడీ చేసాడట.

నిజానికి ఈ సినిమాను నాలుగేళ్ల క్రితమే వీరిద్దరూ కలిసి చేయాల్సి ఉంది. అందులో హరికృష్ణ కీరోల్‌లో అనుకున్నారట. అయితే హరికృష్ణ హఠాత్ మరణంతో ఈ ప్రాజెక్టు అప్పట్లో సెట్స్ పైకి రాక‌ముందే ఆగిపోయింది. ఇప్పుడు మ‌ళ్ళీ ఈ ప్రాజెక్ట్‌ రెడీ అవుతుంది. ఇక దీనిలో మరో హీరో పాత్ర కోసం మ‌రో స్టార్ హీరోను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్త‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విజయ్ సేతుపతి. ఇక‌ డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోయే ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.