టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కాగా పూజకు ఒక్కసారిగా వరుస ప్లాప్లు పడ్డాయి. దీంతో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఇక లాభంలేదని ఇక్కడి నుంచి బాలీవుడ్ లో అవకాశాల కోసం అక్కడకు మఖాం మార్చేసింది ఈ బుట్టబొమ్మ. అయితే అక్కడ కూడా ఆమెకు ఊహించిన రేంజ్లో సక్సెస్ అందలేదు. ఇక తాజాగా పూజకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని.. టాప్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాన్ని.. తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ షాకింగ్ పోస్టును షేర్ చేశారు. దుబాయ్లో తీవ్రమైన వాదన తర్వాత పూజా హెగ్డేకి హత్యా బెదిరింపులు వచ్చినట్లుగా ఈ పోస్టులో రాసి ఉంది. వైరల్ భయాన్ని ప్రకారం పూజ ఓ క్లబ్ ఓపెనింగ్ ఈవెంట్ కోసం దుబాయ్ కి వెళ్ళిందట. కానీ అక్కడ బెదిరింపులు రావడంతో వెంటనే భారతదేశానికి తిరిగి వచ్చిందని చెబుతున్నారు. అయితే అసలు ఆ బెదిరి్ంపులకు కారణం ఏంటి.. ఏం జరిగి ఉంటుంది.. అనే విషయంపై పూజాహెగ్డే నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఈ పోస్ట్ షేర్ చేసిన కొంత సమయానికి వైరల్ భయాని దీన్ని డిలీట్ చేశారు. ఇక పూజా హెగ్డే చివరిగా సల్మాన్ ఖాన్తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కా జాన్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎటువంటి సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న పూజా హెగ్డే.. బాలీవుడ్లో మాత్రం షాహీర్ కపూర్తో దేవా అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించన్నుంది. రోషన్ అండ్ రోజ్ డైరెక్టర్గా ఈ సినిమాను సిద్ధార్థ్ రాయ్ కపూర్ జీ స్టూడియోస్తో కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ మూవీ 2025 అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.