” ఇప్పుడొస్తున్న సినిమాలలో అది ఎక్కువైంది “… నటి సెన్సేషనల్ కామెంట్స్…!

సీనియర్ నటి సుహాసిని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. ఇక సుహాసిని రెమ్యూనరేషన్ లో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ.. తాజాగా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ” అన్ స్టాపబుల్ ” షో కి హాజరైంది.

ఇక ఈ క్రమంలోనే సుహాసిని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలలో మీరు చూస్తున్న మార్పు ఏమిటి అని సుహాసినికి ఓ ప్రశ్న ఎదురయింది. ఇక దీనికి సమాధానం ఇస్తూ..” ఈ మధ్యకాలంలోని సినిమాలలో హింస ఎక్కువైంది.

నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్న గత 40 సంవత్సరాలలో ఇంత హింసను ఎప్పుడు చూడలేదు. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. ఓటీటీ మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత హింస సామాన్యమైపోయింది. హింసకు ప్రేక్షకులు అలవాటైపోయారు. గతంలో ఎవరైనా తల తీస్తా అంటే అది డైలాగ్ వరకే ఉండేది. కానీ ఇప్పుడు తల నరికేయడం చూపిస్తున్నారు ” అంటూ కామెంట్స్ చేసింది సుహాసిని. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.