‘ దూత ‘ సిరీస్‌కి నాగచైతన్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

అక్కినేని నట వార‌సుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు నాగచైతన్య. ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా చైతు.. గ‌త‌ కొంతకాలంగా నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయాయి. వరుసగా 6 హిట్లు అందుకున్న నాగచైతన్య కు.. థాంక్యూ సినిమాతో పెద్ద బ్రేక్ పడింది. ఈ సినిమా తర్వాత చైతూ నటించిన కస్టడి సినిమా కూడా ఫ్లాప్ కావడంతో.. అక్కినేని ఫ్యాన్స్ అంత నిరాశ చెందారు. అయితే నాగచైతన్య మళ్ళీ ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ట్రాక్‌లో పడితే బాగుండ‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే సినిమా పరంగా ఎప్పుడు సక్సెస్ అందుకుంటాడో తెలియదు కానీ.. ఇటీవల వచ్చిన దూత వెబ్ సిరీస్ తో మాత్రం భారీ సక్సెస్ అందుకొని పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎపిసోడ్ రిలీజై ఆడియన్స్ కు అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని అందించింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ కలిగించే విధంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఇక ఎవ‌రు ఊహించని రేంజ్ లో లాభాలు రావడంతో నాగచైతన్యకు ముందుగా అనుకున్న దానికంటే అధికంగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకు వచ్చిందట.

 

ఈ ఓటీటీ సంస్థ ముందు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఓ వెబ్ సిరీస్ కు గాను రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారట‌. కానీ ఇప్పుడు ఆ సీరియస్ బ్లాక్ బస్టర్ అయి అదిక లాభాలు రావడంతో మరో రూ.5 కోట్ల రేషన్ అధికంగా నాగచైతన్యకు అందజేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు నాగచైతన్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కానీ ఒక్క సినిమాకి కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం గమనార్హం. అలాంటిది ఒకే ఒక వెబ్ సిరీస్ తో నాగచైతన్యకి జాక్పాట్ తగిలినట్టు అయింది. డబ్యూ సిరీస్‌కు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడంతో చైతు ఇక మీదట కూడా ఇలాంటి వెబ్ సిరీస్ చేయాలని భావిస్తున్నాడట.

ప్రస్తుతం నాగచైతన్య – చందు మండేటి డైరెక్షన్లో తాండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ల‌వ్‌ స్టోరీ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ తర్వాత మళ్లీ నాగచైతన్య – సాయి పల్లవి కాంబో రిపీట్ కావడంతో ఈ సినిమా కూడా అదే రేంజ్‌లో సక్సెస్ అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. గుజరాత్ జాలర్ల నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తరకెక్కుతుంది. ఇక ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే గేమ్ చేంజర్ మూవీగా మారబోతుందని తెలుస్తుంది.