” ఆయనని అనవసరంగా హైలెట్ చేయకండి “.. అమర్ సెన్సేషనల్ కామెంట్స్..!

బిగ్ బాస్ సీజన్ 7 ఘనంగా పూర్తయిన సంగతి తెలిసిందే. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ సందడి పూర్తి కాగానే.. టాప్ సిక్స్ లో ఉన్న అర్జున్, ప్రియాంక, యావర్, శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్ ఇలా వరుసగా బిగ్ బాస్ బస్ లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.

ఇక అమర్ ను ఇంటర్వ్యూ చేసే క్రమంలోనే గీతూ.. మీరు 105 డేస్ హౌస్ లో ఉంటారని ఊహించారా అని అడిగింది. దానికి అమర్… మొదటి నాలుగు వారాలు నేను ఆడిన ఆటకు అప్పుడే బయటకు వస్తా అనుకున్నా… కానీ తరువాత బాగా ఆడాను అని చెప్పాడు. అలా హౌస్ లో ఒక్కొక్కరి గురించి గీత ప్రశ్నిస్తూ…” శివాజీ నేన్ను వెళ్తే ప్రశాంత్ ని విన్నర్ ని చేసే పోతా అంటూ మాట్లాడాడు.

దానికి మీ సమాధానం ఏంటి ” అని అడగగా… దానికి అమర్ సమాధానమిస్తూ…” అలా చెప్పి ఆయన్ని పైకి లేపకండి. ఆయన గేమ్ ఆయన ఆడుకుని వెళ్లిపోయారు. ప్రశాంత్ గేమ్ ప్రశాంత్ ఆడుకుని కప్పు కొట్టాడు అంతే ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం అమర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.