ఒకప్పటి టాప్ హీరోయిన్ మాల శ్రీ ఇప్పుడు ఎలా ఉందో చూశారా… మరీ ఇలా అయిపోయింది ఏంటి భయ్యా…!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాలశ్రీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక ఈమె చిన్న బాబు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన పోటాపోటీగా నటించింది. ఈ సినిమా కాస్త మంచి హిట్ అవడంతో ఈ అమ్మడుకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తన అద్భుతమైన అందం, నటనతో అప్పటి కుర్రాళ్లకి పిచ్చెక్కించిందనే చెప్పాలి. ఈమె అసలు పేరు శ్రీ దుర్గా. సినిమాల్లోకి వచ్చిన తరువాత తన పేరును మాలశ్రీ గా మార్చుకుంది.

ఈమె ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో సైతం నటించింది. ఇక ఈ అమ్మడు కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నటుడు సునీల్ అనే వ్యక్తిని ఇష్టపడింది. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. అనంతరం వివాహం సైతం చేసుకున్నారు. ఇక ఒకానొక సమయంలో వీరిద్దరూ కారుపై బయటకు వెళ్లినప్పుడు.. కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో మాల శ్రీ తీవ్ర గాయాలతో బయటపడింది. కానీ సునీల్ మాత్రం తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు.

దీంతో ఈమె కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇక అనంతరం కొన్ని సంవత్సరాలకి నిర్మాత రాముని రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప కూడా జన్మించింది. వివాహ అనంతరం మాల శ్రీ సినిమాలకు పూర్తిగా దూరమై తన కుటుంబంతో సంతోషంగా గడిపేస్తుంది. ఒకప్పుడు ఎంతో అందంగా, సన్నగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం ఎవ్వరు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. చాలా బొద్దుగా, అంధకారంగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈమె తన భర్త, పిల్లతో తన జీవితాన్ని గడిపేస్తుంది.