ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది ఎక్కువ మృతుల సంఖ్య కనిపిస్తుంది. ఇక ఈ ఏడాది చివరి దశకు వచ్చేసాము కదా అని అనుకునే లోపు మరో విషాదం నెలకొంది. అదేంటంటే…సినీ నటుడు, డిఎండికే అధినేత విజయ్ కాంత్ మనందరికీ సుపరిచితమే. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా ఈయన అభిమానులకి ఓ భారీ షాక్ తగిలింది.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన… నేడు మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మరణించాడు. ఈయన 1952 ఆగస్టు 25న జన్మించారు.
ఇక విజయ్ కాంత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి తరలి వెళ్లారు. అలాగే తమిళ్ రాజకీయాలలో విజయ్ కాంత్ కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈయనని చూసేందుకు రాజకీయ నాయకులు సైతం హాజరయ్యారు. 2005 సెప్టెంబర్ 14న డిఎండీకె ను స్థాపించాడు విజయ్ కాంత్. అనంతరం సక్సెస్ ని వెలుగు చూశాడు. ఇక ప్రస్తుతం ఈయనకి ఇలా జరగడం చాలా బాధాకరం.