” యానిమల్ ” ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్..‌!!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ” యానిమల్ “. ఈ సినిమా కేవలం ఒక్క భాషలోనే కాకుండా… పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. ఇక డిసెంబర్ 1 (నిన్న) రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లాక్ అయిన సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ సినిమా ఎప్పటినుంచి వస్తుందో తెలుస్తుంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ సినిమా జనవరి 26 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ రానున్నట్లు సమాచారం.

ఇక దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా పై మేకర్స్ ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో చూడాల్సిందే. ఇక అదే విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే.. అటు రణబీర్ కపూర్ ఇటు రష్మిక మందన లైఫ్ సెట్ అయినట్లే. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.