ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 పౌర్తైన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో రన్న రప్గా మిగిలిన అమర్దీప్ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ సీజన్ ముగిసిన తర్వాత అమర్దీప్ కారులో వెళుతుండగా పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ కార్ పై దాడి చేసిన సంఘటన తెలిసిందే. ఈ వివాదం కారణంగా ప్రశాంత్ ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే ఈ కార్యక్రమంలో అతి తక్కువ ఓట్లతో రనరప్గా మిగిలిన అమర్.. బిగ్ బాస్ తర్వాత ఎవరికి ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు.
ఎవరికి అందుబాటులో లేకుండా దూరంగా గడుపుతున్నాడు. బిగ్బాస్ కార్యక్రమం పూర్తి కాగానే అనంతపురం వెళ్ళాడు. తన ఫ్యామిలీతో కలిసి అక్కడే కొద్ది రోజులపాటు ఉన్నటువంటి ఆయనా అభిమానులందరినీ కలిశాడు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నా అమర్ హైదరాబాద్లో కూడా లేరట. ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తనతో ఇంటర్వ్యూ చేయాలని వెళ్లిన ఆయన ఇంట్లో లేకపోవడంతో.. తిరిగి వెనక్కి వచ్చారట.
ఇక ఈ న్యూస్ బయటకు వినిపించడంతో అమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ వార్తలపై అమర్ స్నేహితుడు నరేష్ లోల్లా స్పందించాడు. నరేష్ మాట్లాడుతూ బిగ్ బాస్ షో కారణంగా అమర్ ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడని.. అయితే అతనికి మానసిక ప్రశాంతత అవసరమనే ఉద్దేశ్యంతోనే తేజస్వితో కలిసి వెకేషన్ కు వెళ్లారని.. వెకేషన్ పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తాడు అంటూ వివరించాడు.