కత్రినా దగ్గర రూ.5 కోట్లు అప్పు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో… ఎందుకో తెలుసా…!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా పరిచయమైన కత్రినా.. అనంతరం బాలీవుడ్ కి వెళ్లి వరుస సూపర్ హిట్ లని అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇక ” మల్లీశ్వరి ” సినిమా ద్వారా టాలీవుడ్ కి రిఎంట్రీ ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా హిట్ అవడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

దక్షిణాదిలో సినిమాలు తక్కువగానే చేసినప్పటికీ కొంతమంది స్టార్ హీరోలతో మాత్రం బాగా క్లోజ్ అయింది. పార్టీలలో కూడా కలుసుకుంటున్న వారిని కూడా మంచి స్నేహితులుగా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పట్లో కుర్ర హీరో ఒక సినిమాని నిర్మించాడట. హీరోగా కూడా ఆయనే నటించాడు. దీనికి సంబంధించి రివ్యూలు మంచిగా వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్ట లేకపోయింది.

ఫైనాన్సర్స్ కి తిరిగి డబ్బులు ఇచ్చేందుకు ఆ సమయంలో ఆ హీరో దగ్గర ఒక్క రూపాయి కూడా లేదట ‌. ఎవరిని అడగాలో తెలియక కత్రినా ని రూ. 5 కోట్ల రూపాయలు డబ్బులు సర్ద‌మని అడిగాడట. అడిగిన వెంటనే కత్రినా కూడా ఆ డబ్బులు ఇచ్చిందట. అయితే ఇప్పటివరకు ఆ కుర్ర హీరో ఆ రూ.5 కోట్ల‌లో ఒక్క రూపాయి కూడా కత్రినాకు తిరిగి ఇవ్వలేదట. ఆ కుర్ర హీరో ఎవరో తెలియక పోయినప్పటికీ… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.