స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో చేసిన వాళ్లకి… ఏకంగా అన్నేళ్లు జైలు శిక్ష, జరిమానం కూడానా…!!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమెకు చెందిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ‌. హీరోయిన్ రష్మిక కు చెందిన డీప్ ఫేక్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీనిపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లకు ఓ సలహాను జారీ చేసింది. అటువంటి డీప్ ఫేక్‌ ల‌ను కవర్ చేస్తే చట్టపరమైన నిబంధనలను అమలు చేస్తామని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్న్ తో ఈ వీడియోను తయారు చేసినట్లు గుర్తించారు. డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు రూల్ రిమైండర్ ను పంపింది.

ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 లోని సెక్షన్ 66D ప్రకారం..కంప్యూటర్ వనరులను ఉపయోగించి.. ఎవరినైనా కించ పరిచే విధంగా చేస్తే.. మూడు సంవత్సరాల జైలు శిక్ష, ఒక లక్ష రూపాయల జరిమానం విధిస్తామని పేర్కొన్నారు. కాగా ఈ వీడియో తనదే అని ఓ మహిళ ఒప్పుకుంది. కానీ తన వీడియోను ఎవరు అలా చేశారో తనకు తెలియదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.