హైదరబాద్ లో ల్యాండ్ అయిన కొత్త కపుల్..అప్పుడే మొదలు పెట్టేశారా..!!

లవ్ బర్డ్స్ లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి బంధంతో.. నవంబర్ 1న ఒక్కటయ్యారు. వీరి వివాహం ఇటలీలో అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ పెళ్లికి మెగా హీరోలు అందరూ హాజరయ్యారు. వీరి పెళ్లికి మూడు రోజులు మూడు కార్యక్రమాలు పెట్టుకొని.. బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒక్కరే హాజరయ్యారు. నితిన్ ఒక్కడే బయట వ్యక్తి. అత్యంత సెలబ్రిటీలకు సైతం ఆహ్వానం దక్కలేదు.

వీరి పెళ్లి అనంతరం లావణ్య, వరుణ్ హైదరాబాద్ కి చేరుకున్నారు. ననవ దంపతులను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చూసిన మీడియా ప్రతినిధులు.. ఫోటోల కోసం ఎగబడ్డారు. వీరిద్దరిని కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఇక వరుణ్ ఈ ఫొటోస్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు.

అల్ట్రా స్టైలిష్ గెటప్ లో అదిరీపోయాడు. లావణ్య త్రిపాఠి మాత్రం చుడిదార్ లో పద్ధతి కలిగిన స్త్రీలా కనిపించింది. అయితే పద్ధతిగా కనిపించిన కూడా.. లావణ్య త్రిపాఠి నుదుటిన బొట్టు లేకపోవడం మెగా ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. అసలు ఆమె బొట్టు ఎందుకు పెట్టుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక నవంబర్ 5న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్న సంగతి మనకి తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, సన్నిహితులు హాజరవ్వనున్నారట. ప్రస్తుతం ఎయిర్పోర్టులో తీసిన వీరి ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.