యానిమల్ ” సినిమా నుంచి లేటెస్ట్ బజ్… ఇక బొమ్మ అదుర్సేగా…!!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ ” యానిమల్ “. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ఏకంగా 3 గంటల 21 నిమిషాల కట్‌తో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కోసం రణబీర్ కపూర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా మరో ఇంటరెస్టింగ్ బజ్ ఈ సినిమాపై వినిపిస్తుంది. ఈ సినిమాకి కూడా సీక్వెల్ అనేది ఉండవచ్చు అనే టాక్ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల నుంచి స్టార్ట్ అయింది.

సందీప్ ఈ సీక్వెల్ మ్యాచ్ అయ్యేటట్టు స్టోరీ రెడీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.