టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనకు నేషనల్ అవార్డ్ కూడా సొంతం చేసుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్ సావిత్రి బయోపిక్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో టాలీవుడ్ మహానటిగా క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత పలు సినిమాలో నటించిన కీర్తి.. చివరిగా నానితో కలిసి దసరా సినిమాలో నటించింది.
పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటున్న కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ ఆమె ఎదుర్కొన లైంగిక వేధింపుల గురించి కొన్ని షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో రోడ్డు మధ్యలో నా స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెళుతున్న.. ఇంతలో ఓ తాగుబోతు వచ్చి నాపై చేయి చేసుకున్నాడు.. అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఒక్క నిమిషం చూసి అతనిని చెంపపై లాగిపెట్టి కొట్టా.. దీంతో అప్పుడు నన్ను చుట్టుపక్కల వారంతా అలాంటి సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు మెచ్చుకున్నారు అంటూ వివరించింది. అయితే కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది.