వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన క్రికెట్ దిగ్గజాలు, స్టార్ హీరోలు…!!

ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్స్ కావడంతో క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ మ్యాచ్ చూడడానికి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ మ్యాచ్ను వీక్షించేందుకు నరేంద్ర మోడీ సైతం హాజరవ్వనున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ కు ఈయన ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నట్లు వార్తలు చెబుతున్నాయి. మోడీతో పాటు క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోని, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్ కు హాజరవ్వనున్నట్లు సమాచారం.

ఇక సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, రామ్ చరణ్, నాగార్జున, వెంకటేష్, మమ్ముట్టి, కమల్ హాసన్ ఇలా పలువురు ప్రముఖులు హాజరవ్వనున్నారు. ఈ మ్యాచ్ కి సినీ రంగం నుంచి ఎంతమంది పేర్లు హాజరవుతున్నప్పటికీ అందులో రజినీకాంత్, రామ్ చరణ్ పేర్లు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .