హాఫ్ శారీలో హాట్ ట్రిట్ ఇస్తున్న శ్రీదేవి కూతుళ్లు.. ఎంత ముద్దొస్తున్నారో..

అతిలోక సుందరి శ్రీదేవి కూతుళ్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్ కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. శ్రీ‌దేవి కూతుళ్ళుగా ఇండ‌స్ట‌రీలోకి రాక‌ముందే లైమ్‌లైట్‌లో వెలిగిన ఈ ముద్దుగుమ్మ‌లు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. ఇక‌ జాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది. ఇటు టాలీవుడ్ లోనూ ఎన్టీఆర్ శర‌సన దేవరాలో నటిస్తుంది జాన్వి. ఇక దేవర సినిమా సక్సెస్ అయితే సౌత్ లో జాన్వికి తిరుగులేని క్రేజ్ వస్తుంది. ఇక ఖుషి కపూర్ ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సిద్ద‌మైంది.

ఇదిలా ఉంటే జాన్వి కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ఆమె సినిమా విషయాలను, హాట్ ఫోటోషూట్లను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను ఖుషి చేస్తున్నాయి. దీవాలి సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ అక్క, చెల్లెలు నిన్న హాఫ్ శారీలో దర్శనమిచ్చారు. ఇంట్లో జరిగినా ధన త్రయోదశి ఫెస్టివల్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మలు సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. లంగా వోణిలో జాన్వి కంటే ఖుషి కపురే మరింత అందంగా కనిపిస్తుందని నెట్టిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అక్క కంటే చెల్లె ఎక్కువ ముద్దొస్తుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి వీరి ట్రెడిషనల్ లుక్ తో ఫాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ అక్క. చెల్లెలు ఇప్పటికే పలు హిందూ పండుగలో సాంప్రదాయ బద్దంగా నిండు దుస్తులతో దర్శనమిచ్చి ఎంతమంది ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం మరోసారి వీరిద్దరూ హాఫ్ సారీలో దర్శనం ఇవ్వడంతో ఈ పిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఖుషి కపూర్ ది ఆర్చీస్ మూవీ తో బాలీవుడ్ కి పరిచయం కానుంది.