రవితేజ – గోపీచంద్ సినిమా అవుట్… మలినేని పరిస్థితి ఏంటో పాపం…!!

రీసెంట్ గా రవితేజ, గోపీచంద్ హీరోలుగా మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమస్యల వల్లే ఆపేసారని సమాచారం. ఈ మధ్యకాలంలో వరుస విజయాలు అందుకున్న రవితేజ పారితోషకం రూ. 25 కోట్ల రేంజ్ కు పెరిగింది.

కానీ ఈ సినిమాకి మేకర్స్ రూ. 12 నుంచి రూ.15 కోట్ల వరకు ఇస్తామని చెప్పారట. మూవీ బడ్జెట్ రూ. 120 కోట్లు కాగా.. మార్కెటింగ్ రూ. 100 కోట్ల రూపాయలను మించి చేయడం కష్టమని, హిందీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ హక్కులకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్టు నిజంగా ఆగిపోయిందో లేదో మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇక గోపీచంద్ మలినేని, రవితేజ కాంబో బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన డాన్ శీను, బలుపు, కిక్ ప్రేక్షకులని ఎంతగా మెప్పించాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలలో రవితేజ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. కాబట్టి వీరి కాంబో మరోసారి రిపీట్ అయితే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అంటున్నారు ప్రేక్షకులు.