” నన్ను గుర్తించి పారితోష‌కం పెంచిన‌ ఆ స్టార్ హీరోకి రుణపడి ఉంటా “…లేడీ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ …!!

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఫరా ఖాన్.. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్ గా కొనసాగుతుంది. ” జో జీతా వో సిందర్, దిల్ తో పాగల్ హై ” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసి ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకుంది ఫరా ఖాన్. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆసక్తికర కామెంట్లు చేసింది. సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల ప్రొఫెషనల్ స్కిల్స్ బాగా నేర్చుకున్నట్లు ఈమె తెలిపింది.

ఇక మణిరత్నం, ప్రియదర్నన్ వంటి డైరెక్టర్లతో కలిసి పనిచేయడం ద్వారా టైమ్ పంచువాలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నట్లు తెలిపింది. ఇక బాలీవుడ్ మాదిరిగా కాకుండా సౌత్ సినిమా సెట్స్ లో ప్రతి ఒక్కరు టైం కు వస్తారని.. ఒకరినొకరు గౌరవించుకుంటారని తెలిపింది. అయితే కొరియోగ్రాఫర్ గా తన కష్టానికి తగిన ఫలితం హీరో నాగార్జున వల్లే దక్కిందన్న ఫరా ఖాన్.. ఇనిషియల్ స్టేజ్ లో రెమ్యూనరేషన్ పెంచిన వ్యక్తి ఆయనేనని చెప్పుకొచ్చింది.

ఇక 2004లో ” మై హౌన్ నా ” సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఫరా ఖాన్… 2007లో రిలీజ్ అయిన ” ఓం శాంతి ఓం ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఇక భర్త శిరీష్ కుంద్రతో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ ప్రారంభించిన ఫరా ఖాన్..” తీస్ మార్ ఖాన్, జోకర్ ” సినిమాలను నిర్మించింది. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.