ఓవర్సీస్ లో మొదలైన ప్రభాస్ మానియా.. అరగంటలో అన్ని వేల టికెట్లు అమ్ముడుపోయాయ..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ సుపరిచితమే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో గా నిలిచిన ప్రభాస్… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా నటిస్తున్న మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఎప్పుడో సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా… మరింత క్వాలిటీ అవుట్పుట్ కోసం పలు సన్నివేశాలను రీ షూట్ చేసి.. కొత్తగా ఒక ఐటమ్ సాంగ్ ని జత చేర్చి డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ లో పాల్గొనున్నారు. అలాగే డిసెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సైతం విడుదల చేయనున్నారు. ఇక ఇదివరకే టీజర్ ని విడుదల చేయగా దానికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. కూడా ప్రభాస్ ముఖాన్ని సరిగ్గా చూపించలేదు అని విమర్శలు సైతం వచ్చాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకులలో ఓ ఊపు వస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ నార్త్ అమెరికాలో నిన్ననే ప్రారంభమయ్యాయి. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించగా కేవలం అరగంట లోనే 10 వేల టికెట్లు అమ్ముడు పోయాయని.. దాదాపు మూడు లక్షల రూపాయల గ్రాస్ నెల రోజుల ముందే వచ్చేసిందని అంటున్నారు. ఇక కేవలం ప్రీమియర్ షోస్ 2 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టాలని మేకర్స్‌ చూస్తున్నారు. మరి సలార్ టీం కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.