ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుందంటూ.. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఫిలింనగర్లో మరోసారి సలార్ పోస్ట్ పాన్ కాబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అందుకు కారణం బాలీవుడ్ బాద్షా షారుక్ నటించిన డుంకి సినిమా అని సమాచారం.
ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సలార్, డుంకి సినిమాలు పోటీ పడబోతున్నాయని తెలిసిందే. ఈ నేపద్యంలో కొన్ని రోజులుగా డుంకి సినిమా వాయిదా పడుతుందని వార్తలు వినిపించాయి. అయితే డుంకి సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు జరగవు అని మూవీ మేకర్స్ తెల్చి చెప్పేశారు.ఇక పఠాన్, జవాన్ సినిమాలతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్న షారుక్ ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు కొల్లగొట్టి రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోతున్న డుంకిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా అదే రేంజ్లో కలెక్షన్లను రాబట్టడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
మరోవైపు ఆది పురుష్ రాదేశ్యమ్ లాంటి డిజాస్టర్ లతో ప్రభాస్ ఉన్నాడు. ఇక ఎలాగైనా ఈసారి ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి పోటీలో దిగితే ఏదో ఒక సినిమాకు అంత ఇంతో నష్టం రావడం ఖాయం. దీంతో ప్రభాస్ వెనకడుగు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సలార్ వచ్చే ఏడాద రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తున్నారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక సిని వర్గాల సమాచారం ప్రకారం సలార్ వాయిదా పడుతుందంటూ వచ్చిన న్యూస్ లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ రూమర్లని తెలుస్తుంది. వీటిలో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.