NTR31 మూవీ ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందా.. ప్రశాంత్ నీల్ బిగ్ రిస్క్ చేస్తున్నాడుగా..!!

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ హీరో యష్ హీరోగా తెరకెక్కించిన కేజిఎఫ్ సిరీస్‌లతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్నాడు ప్ర‌శాంత్ నీల్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇక ఈ మూవీ 2024 ఏప్రిల్ నుంచి సెట్స్‌ పైకి రానుంది. ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు ప్రశాంత్.

డ్రీమ్‌ ప్రాజెక్ట్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సాధారణంగానే ప్రశాంత్‌ సినిమాలు అంటే భారీ లెవెల్ లో ఉంటాయి. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏ రేంజ్ లో ఉండిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక యంగ్ టైగర్ – ప్రశాంత్ కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ 31 షూటింగ్ 18 దేశాల్లో ప్లాన్ చేస్తున్నారట ప్రశాంత్ నీల్‌. దాదాపు సినిమా మొత్తం ఓవర్సీస్ లోనే జరగబోతుందని టాక్. దీంతో పాటు ఎన్టీఆర్ 31 గురించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది.

సినిమా చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ నేపథ్యంలో తెరకెక్కుతుందట. ఉక్రెయిన్ లోని కీప్ ప్రాంతంలో 26 ఏప్రిల్ 1986లో న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది. అంటే ఇప్పటికీ ఇది జరిగి దాదాపు 37 సంవత్సరాలు గడుస్తోంది. ఈ డిజాస్టర్ ప్రపంచాన్ని కుదిపివేసింది. చెర్నోబిల్ నేపద్యంలోనే ప్రశాంత్ నీల్‌ కథను రాసుకున్నాడట. మరి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 31 ఉంటే మాత్రం ప్రశాంత్ నీల్ బిగ్ రిస్క్ చేస్తునట్లే. అలాగే పాన్ ఇండియా కాదు పాన్ వ‌రల్డ్‌ లెవెల్ లో ఎన్టీఆర్ సినిమా నటించినట్లు అవుతుంది.