” తప్పులు చేసిన వారిని దేవుడే క్షమిస్తాడు “… త్రిష పోస్ట్ ఎవరిని ఉద్దేశించి..?!

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక తాజాగా త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ మధ్య గత కొద్ది రోజుల నుంచి ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. త్రిషాను ఉద్దేశించి మన్సూర్ చేసిన వ్యాఖ్యలు దేశ స్థాయిలో మంటలు పుట్టించాయి. దీంతో పలువురు ప్రముఖులు త్రిషకు మద్దతు కూడా చేశారు.

ఇక కుష్బూ అయితే ఏకంగా మహిళ కమిషన్ ను మన్సూర్ మీదకు పంపించింది. దీంతో ఇమ్మీడియట్ గా కేసు నమోదు చేసింది మహిళా కమిషన్. త్రిష కు క్షమాపణలు చెప్పించాల్సిందే అని ప్రతి ఒక్కరూ మన్సూర్ ను ఒత్తిడి పెట్టారు. కానీ మన్సూర్ మాత్రం క్షమాపణలు తెలపలేదు. తనేమీ తప్పుగా మాట్లాడలేదని… త్రిష కు క్షమాపణలు చెప్పనని తెగేసి చెప్పాడు.

అయితే చివరకు త్రిషకు .. మన్సూర్ తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడు. ఇక తాజాగా మన్సూర్ ను ఉద్దేశించి త్రిష ఓ ట్వీట్ చేసింది. అదేంటంటే….” తప్పులు చేయడం మానవ సహజం.. దేవుడు క్షమిస్తాడు ” అంటూ ట్విట్ చేసింది. దీని బట్టి చూసుకుంటే మన్సూర్ ను త్రిష క్షమించేసినట్లుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం త్రిష పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.