తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఈ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్.ఈయన కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. అలాగే ఈయన దివంగత దర్శకుడు కె. విశ్వనాథ్ కి దగ్గర బంధువు. చంద్రమోహన్ భార్య పేరు జలంధర్.
ఈమె రచయిత్తి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు సైతం ఉన్నారు. ఇక ఈయనకి సినిమాలు మీద ఆసక్తి ఉండడంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఈయన దేశవ్యాప్తంగా 932 సినిమాలలో నటించారు. చంద్రమోహన్ నటనకు గాను రెండు ఫిలిం ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు వచ్చాయి. ఇక గత కొద్ది రోజుల నుంచి ఈయనకు ఆరోగ్యం బాగోవడం లేదు. అందువల్ల వీరిని అపోలో హాస్పటల్లో జాయిన్ చేశారు.
ఈయనకి ఏదైనా అయితే తన కూతుర్లు ఏమైపోతారో.. అన్న బాధతో మరింత కృంగిపోయారు చంద్రమోహన్. తద్వారా హార్ట్ ఎటాక్ వచ్చి మరణించారు. ఈయన తీసుకున్న ఒత్తిడి కారణంగానే ఇలా జరిగిందని డాక్టర్లు సైతం చెప్పారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈయనకి ఇలా జరగడం బాధాకరం. ప్రస్తుతం ఈయన మరణ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి