బిగ్బాస్ సీజన్ సెవెన్ రసవతరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉల్టా పల్టా కాన్సెప్ట్తో రూపొందిన ఈ సీజన్ ఎన్నో సర్ప్రైజ్లు.. టాస్కులతో టైటిల్ కు తగ్గట్టుగానే కొన్ని ఉల్టా పల్టా ట్విస్టులతో కొనసాగుతుంది. ఇక నిన్నటి వారం ఎలిమినేషన్ ఎత్తేశారు. ఫ్రీ ఎవిక్షన్ పాస్ కారణంగా ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగ్ అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇక ఈ వారం నామినేషన్లో అర్జున్, శోభా శెట్టి, అమర్, యావర్, రతికా, అశ్విని, గౌతమ్ ఉండగా అంతా సేవ్ అయ్యారు. చివరికి అశ్విని, గౌతమ్ మిగులగా వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎలిమినేషన్ లో ఇద్దరు సేఫ్ అని ప్రకటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
నిన్నటి వారం ఎలిమినేషన్ లేకపోవడానికి కారణాన్ని వివరించాడు నాగార్జున. యావర్ ప్రిఎవిక్షన్ పాస్ను రిటర్న్ ఇవ్వడం కారణంగా ఎలిమినేషన్ని బిగ్ బాస్ తీసేసాడని వివరించాడు. మరోసారి ప్రీ ఎవిక్షన్ పాస్ ని సంపాదించే అవకాశాన్ని బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఇస్తున్నాడని చెప్పుకొచ్చిన నాగ్.. వచ్చేవారం మాత్రం రెండు ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయంటూ ట్విస్ట్ ఇచ్చాడు. యావరు ఎవిక్షన్ పాస్ని వెనక్కి ఇవ్వడానికి ఎలిమినేషన్ను ఆపేయడానికి సంబంధం ఏంటి అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదంతా లాజిక్ లేదు అని ఎవరినో ఎలిమినేషన్ నుంచి కాపాడడానికి ఇలా చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సీజన్ లో వచ్చేవారం మళ్ళీ డబల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుత హౌస్ లో శివాజీ, అర్జున్, పల్లవి ప్రశాంత్, రతిక, గౌతమ్ ఉన్నారు. ఈ వరం గౌతమ్, అశ్వినిలలో కచ్చితంగా ఒకరు సేవ్ అయినట్లే. వచ్చేవారం వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు నెట్టిజన్లు. ఇక నిన్న సండే స్పెషల్ నేపథ్యంలో కోటబొమ్మాలి పిఎస్ టీం బిగ్బాస్కు వచ్చి సందడి చేశారు. శ్రీకాంత్ అందరి ఆటకు రివ్యూ ఇవ్వగా శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్ కూడా ఈ ఇవెంట్లో పాల్గొన్నారు.