దివంగత నటి సౌందర్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సౌందర్య ఒకటి. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో హీరోయిన్గా సక్సెస్ అందుకున్న సౌందర్య టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఎక్స్పోజింగ్కి దూరంగా ఉంటూ.. అచ్చ తెలుగు ఆడపిల్లల కట్టు, బొట్టుతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటి ఎవరు అంటే టక్కున చెప్పేది సౌందర్య. ఎలాంటి గ్లామర్ షోకు తావు లేకుండా ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న సౌందర్య తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
రాజకీయ ప్రచార కార్యక్రమం కోసం బయలుదేరిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్ మరణం చెందారు. ఆమె మరణించి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ కోట్లాదిమంది ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఎటువంటి పాత్రనైనా అవలీలగా నటించే సౌందర్య.. ఒక్క సినిమాలో మాత్రం నటించడానికి ఎన్నో ఇబ్బందులు పడిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? ఎందుకు అంతగా ఇబ్బంది ఫీలయ్యింది..? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. రమ్యకృష్ణ అమ్మోరు గాను, సురేష్ హీరోగా, సౌందర్య ప్రధాన పాత్రలు నటించిన మూవీ అమ్మోరు.
ఈ సినిమాలో సౌందర్య నటించటానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట. ఈ సినిమాలో అత్త చిత్రహింసలకు బల్లయే కోడలు పాత్రలో సౌందర్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. సురేష్ విదేశాలకు వెళ్ళిపోగా.. సౌందర్యంను ఎన్నో విధాలుగా అత్తింటి వారు టార్చర్ చేస్తూ ఉంటారు, అయితే ఇలాంటి సన్నివేశాలు నటించడానికి ఆమె చాలా కష్టంగా ఫీల్ అయిందట. తనకు ఇబ్బంది అయినా కథ డిమాండ్ చేయడంతో ఆ సినిమాలో సౌందర్య కష్టపడుతూనే ఇష్టంగా నటించారట. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే ప్రేక్షకులు అధిక సంఖ్యలో చూస్తూ ఉంటారు. ఈ మూవీలో సౌందర్య నటన వేరే లెవెల్ లో ఉంటుంది.