బాలీవుడ్ యాక్టర్ రణ్బీర్ కపూర్, రష్మిక మందన హీరో.. హీరోయిన్లుగా నటించిన మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్చ, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ హైదరాబాద్లో గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. నిన్న మధ్యాహ్నం యానిమల్ టీం మీడియాతో ప్రెస్ మీట్ లో ఇంట్రాక్ట్ అయ్యారు. తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీలో యానిమల్ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా జరిగాయి.
డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ కు స్పెషల్ గెస్ట్లుగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ హీరో మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడుతూ యానిమల్ సినిమాపై మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ చూశా అదిరిపోయింది. ఇంతటి ఒరిజినల్ ట్రైలర్ నేను ఇప్పటివరకు చూడలేదు అంటూ వివరించాడు.
సందీప్ ఫోన్ చేసి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించగానే ఓకే చెప్పేసా.. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అడ్వాన్స్ బుకింగ్ లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని విన్నాను.. ట్రైలర్ లో అనిల్ కపూర్ సార్ నటన చూసి గుస్పాన్స్ వచ్చాయి. బేబీ డియాలో యాక్టింగ్ చాలా బాగుంది. రష్మిక అన్ని భాషల్లో దూసుకుపోతుంది. ఒక యాక్టర్ గా రష్మిక చాలా ఇన్స్పిరేషన్. రణ్బీర్కు నేను చాలా పెద్ద అభిమాని. ఆయనతో ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పా కానీ లైట్ తీసుకున్నాడు. మరోసారి ఇదే విషయాన్ని ఈ స్టేజిపై చెప్పాలనుకుంటున్న రణ్బీర్ ది బెస్ట్ యాక్టర్ అని నా అభిప్రాయం.
నేను అతనికి చాలా పెద్ద ఫ్యాన్.. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ వివరించాడు. ఇక రాజమౌళి మాట్లాడుతూ సినిమాను ఇలాగే తీయాలి అని చాలామంది దర్శకులు భావిస్తారు. కానీ ఇలా కూడా సినిమా తీయవచ్చా అనుకునేలా మూవీ తోసే దర్శకుల్లో నాకు తెలిసినంతవరకు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ ఉంటారు. టీజర్ చూడగానే యానిమల్ చిత్రాన్ని చూడాలని డిసైడ్ అయ్యా. ఇక బాలీవుడ్ లో నా ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే నేను రణ్బీర్ కపూర్ అని చెప్తా. ఆయన ఒక అద్భుతమైన నటుడు అంటూ ప్రశంసించాడు జక్కన.