టిష్యూ పై ఓ అభిమాని లేఖ…. అసలు గుట్టు బయటపెట్టిన ఆనంద్ దేవరకొండ..‌!!

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మనందరికీ సుపరిచితమే. ” బేబీ ” సినిమాతో ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకున్నాడో మనందరికీ తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ట్రాయాంగిల్ లవ్ స్టోరీ లో ఆనంద్, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆనంద్ నటనకు గాను విమర్శలకు ప్రశంసలు దక్కాయి.

ఇక దీంతో ఆనంద్ ఫాలోయింగ్ ఓవర్ నైట్ లోనే పెరిగిపోయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆనంద్ తన ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించినప్పుడు అందులో ఉన్న పైలెట్ నుంచి ఓ లెటర్ వచ్చింది. ” హాయ్ డియర్ ఆనంద్. బేబీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ నటనతో మీరు నా మనసు గెలుచుకున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా తరుపున విజయ్ కు హాయ్ చెప్పండి ” అంటూ టిష్యుపై ఆ అభిమాని ఇచ్చిన లేఖను ఆనంద్ తన ఇన్స్టా లో షేర్ చేస్తూ సంబరపడ్డాడు. తన పనిని ఎదుటి వ్యక్తి గుర్తించి ప్రశంసిస్తే కలిగే అనుభూతిని మాటలలో చెప్పలేం అంటూ ఆనంద్ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ” గం గం గణేశ ” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.