నటి స్వాతి దీక్షిత్ పై కేసు నమోదు.. రూ.30 కోట్ల ఇల్లు కబ్జా చేసిందంటూ..!!

టాలీవుడ్‌లో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్వాతి దీక్షిత్. ఈ సినిమాలో హీరోయిన్స్ స్నేహితురాలు పాత్రలో మెప్పించింది. తర్వాత 2012లో తోర్‌నామ్‌ అనే బెంగాలీ మూవీలో హీరోయిన్గా మొదటిసారి నటించింది. ఇక తెలుగులో దెయ్యం, జిలాని, గమ్మత్తు లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో కంటిన్యూస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి పాపులారిటి ద‌క్కించుకుంది. బయటకు వచ్చాక ఆమె ఎక్కడా కనిపించలేదు.

 

అయితే ఇటీవల స్వాతి దీక్షిత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ లో రూ.30 కోట్ల విలువ చేసే ఇంటిని కబ్జా చేసే ప్రయత్నంలో స్వాతి రెడ్డి పలువురు నిందితులతో చేయి కలిపిందని పోలీసులు గుర్తించారు. అమెరికాకు చెందిన ఓ మహిళ ఇల్లు లీజ్ కేసు కోర్టులో నడుస్తుంది. ఈ కేసు విషయంలో స్వాతికి ఆ అమెరిక అమ్మ‌యికి ఏడాది నుంచి వివాదం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకొని స్వాతి రెడ్డి కొంతమంది దుండగులుతో పాటు చింతల ప్రశాంత్ అనే వ్యక్తిని ఇంట్లోకి తీసుకువెళ్లి వాచ్‌మ్యాన్ పై గొడవకు దిగిందట.

దుర్భాషలాడుతూ వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేసిందట. లేదంటే చంపేస్తానని బెదిరించినట్లు తెలుస్తుంది. వెంటనే వాచ్‌మ్యాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ పై ఐపీసీ 147, 148,447, 427, 504, 506 రెడ్ విత్, 147 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారట. ఇక స్వాతి దీక్షిత్‌తో పాటు ఆమెతో కలిసి వెళ్లిన 20 మంది దుండగులపై కూడా కేసు నమోదు అయినట్లు పోలీసులు వివరించారు.