ఎందుకు వరుణ్ తేజ్-లావణ్య ఇటలీలోనే పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా..? ఎవ్వరికి తెలియని టాప్ సీక్రెట్ ఇదే…!!

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి రానే వచ్చింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి చేరుకుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి మనకి మొన్నీ, మధ్యనే, తెలిసింది. ఇక వరుణ్ పెళ్లి వేడుకకు సర్వం సిద్ధమైంది. నిన్న మొన్నటి వరకు షాపింగ్ తో బిజీగా ఉన్న ఈ జంట. ఇప్పుడు ఇటలీ చేరుకున్నారు.

వీరు పెళ్లి ఇటలీలోనే ఎందుకు చేసుకుంటున్నారు? అనే సందేహాలు మనలో చాలామందికి వచ్చాయి. దీనికి ప్రశ్న ఏంటంటే.. వీరిద్దరూ కలిసి నటించిన మిస్టర్ మూవీ షూటింగ్ జరిగింది ఇటలీలోనే.. అక్కడే వరుణ్ తన ప్రేమ లావణ్య కి తెలిపాడట. లావణ్య కూడా వెంటనే ఒప్పుకుందట. తమ ప్రేమ పుట్టిన చోటే పెళ్లి కూడా జరగాలని ఇద్దరు ఆశపడ్డారట.

అందుకు వీరి కుటుంబాన్ని కూడా ఒప్పించి వీరు పెళ్లి ఇటలీలో అంగరంగ వైభోగంగా జరుపుకోబోతున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరూ ఒకటి కానున్నారు. ఇక వీరి వివాహం నవంబర్ 1న గ్రాండ్ గా జరగనుంది. అలాగే ఆ తరువాత నవంబర్ 5న హైదరాబాదులో రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవ్వనున్నట్లు తెలుస్తుంది.