వరస ఈవెంట్స్ ని ఫిక్స్ చేసిన.. ” టైగర్ నాగేశ్వరరావు ” టీమ్ ప్రమోషన్స్ మోతమోగిపోవాల్సిందే….!!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. ఈ సినిమా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు నిజజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అలాగే ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అందరిని ఆకట్టుకున్నాయి. అలాగే అక్టోబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

కాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ముంబైలో నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించిన మేకర్స్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 15న హైదరాబాద్లో జరపనున్నట్లు తెలిపారు. ఈ విధంగా తమ సినిమా గురించి వరుస ప్రమోషన్స్ చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు టీం తప్పకుండా మూవీ రిలీజ్ అనంతరం సక్సెస్ ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. కాగా ఈ మూవీ అక్టోబర్ 20న పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది.