ఆ తప్పుడు వార్తలు నా జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ ..!!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను జీవితంలో ఒక్కసారి అయినా కలుసుకోవాలని కలలు కనేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ తను రాసిన పుస్తకాలని చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించాడు. ఈ ఆవిష్కరణలో భాగంగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

” నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నుంచి సినీ రచయితలతో , జర్నలిస్టులతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. కలం ద్వారా జర్నలిస్టులకు ఎంతో మంచి గుర్తింపు ఉంటుంది. వారి పవర్ మొత్తం ఆ పెన్నుతో రాసే రాతల్లోనే ఉంటుంది. ఇక వీరు ఈ పెన్నుతో రాసేవి కొన్ని నిజాలు అయితే మరికొన్ని అబద్ధాలు అవుతాయి.

కానీ కొంతమంది మాత్రం ఎదుటి వ్యక్తి బాధపడే విధంగా తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు. ఇక ఇలాంటి పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను. ఇక వాళ్లు రాసిన తప్పుడు వార్తలు నా జీవితంలో నేను మర్చిపోలేను. ఆ తప్పుడు వార్తలు జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి ” అంటూ చెప్పుకొచ్చాడు చిరు. ప్రస్తుతం చిరు చేసిన‌ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.