” జాతిరత్నాలు ” కాంబో రిపీట్.. మరోసారి ఫ్యాన్స్ కు నవ్వుల పండగే..!!

డైరెక్టర్ అనుదీప్, హీరో నవీన్ పోలిశెట్టి కి సంబంధించిన మరో సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ” జాతిరత్నాలు ” తో ఊహించని విజయాన్ని దక్కించుకున్న వీరిద్దరి కాంబినేషన్.. మరోసారి రిపీట్ కాబోతుందని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తుంది.

 

అంతేకాదు ” ప్రిన్స్ ” తరువాత అనుదీప్ మరో సినిమా ప్రకటించకపోవడం, నవీన్ సైతం ” మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి ” తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ ఓకే చెయ్యకపోవడంతో ఈ కాంబో కన్ఫర్మ్ అని సన్నిహిత వర్గాల సమాచారం.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే… అప్పట్లో షూటింగ్ పనులు మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన నవీన్ మూవీ ” అనగనగా ఓ రాజు ” ను అనుదీప్ టేకవర్ చేస్తున్నట్లు చర్చ నడుస్తుంది. ఇక ఇది కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో మరోసారి ప్రేక్షకులకు నవ్వుల పండగే అంటున్నారు సినీ విశ్లేషకులు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.