అది చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డ ప్రభాస్.. తనివితీరా ఏడ్చేస్తూ.. కార‌ణం ఇదే..!!

గత ఏడాది అభిమానుల్ని, కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం దిగ్ర్భాంతికి గురైంది. ప్రభాస్ చాలా కృంగిపోయాడు. కానీ ప్రస్తుతం పెదనాన్న మాట ప్రకారం.. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు ప్రభాస్. అందుకే కృష్ణంరాజు, ప్రభాస్ కుటుంబం అనగానే.. అతిధి మర్యాదలతో చంపేస్తారన్న పేరు ఉంది.

కాగా ఇటీవల కృష్ణంరాజు చనిపోయి ఏడాది గడిచిపోయింది. హైదరాబాదులో సంవత్సరికం చేయగా.. ఇందులో భాగంగా కృష్ణంరాజు భార్య శ్యామల దేవి ఆసక్తికర అంశాలు పంచుకుంది. ” పీఠపురానికి చెందిన అభిమాని కృష్ణంరాజు విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహం చూస్తుంటే ఆయన లేరన్న బాధ లేదు.

ఇక ప్రభాస్ ఈ విగ్రహం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక నిమిషం మాట్లాడలేదు. ఆ తర్వాత తనివి తీరా చూసి ఏడ్చాడు. ఎవరు చేశారని అడిగి అతన్ని మెచ్చుకున్నాడు. నిజంగా ఈ విగ్రహంలో జీవకల ఉట్టిపడుతున్నట్లు ఉంది ” అంటూ చెప్పుకొచ్చింది శ్యామలా దేవి.