తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్లుగా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు కూడా హౌస్ లోకి వెళ్లారు. వారిలో శోభాశెట్టి కూడా ఒకరు. కార్తీకదీపం సీరియల్ ద్వారా కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న శోభా శెట్టి చాలా సీరియల్స్లో నటించి మెప్పించింది.
ఇక సీరియల్స్ సెలబ్రిటీస్ తో పాటే అడుగుపెట్టిన హౌస్ మేట్స్ లో ప్రిన్స్ యావర్ కూడా అడుగు పెట్టాడు. తెలుగు రాకపోయినా ప్రిన్స్ యావర్ చాలా కష్టపడి తనకు వచ్చిన తెలుగుతోనే ప్రేక్షకులకు విషయాన్ని కన్వే చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం శోభాశెట్టి – యావర్ కలిసి బుల్లితెరపై ఓ సీరియల్ లో నటించారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సీరియల్ కు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది.
ఇంతకీ వీరిద్దరూ కలిసి ఏ సీరియల్ లో నటించారబ్బా అనుకుంటున్నారా..? డాక్టర్ బాబు హీరోగా నటించిన హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్లో వీళ్ళిద్దరు కలిసి నటించారు. ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారమయింది. ఇందులో శోభ శెట్టి – ప్రిన్స్ యావర్ కలిసి నటించిన సీన్స్ వీడియో క్లిప్ బాగా వైరల్ అవుతుంది. దీంతో వీరిద్దరూ ఇంతకుముందే కలిశారా అంటూ నటిజన్స్ షాక్ అవుతున్నారు.
View this post on Instagram