ఖైదీ సినిమా పై లోకేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.. ఆ మూవీ తర్వాతే స్టార్ట్ చేస్తానంటూ..

లోకేష్ కనగ‌రాజ‌న్‌ ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మాత్రమే పరిచయం ఉన్న ఇతను.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఆడియన్స్ కు అందించి తన సినిమాలతో కొత్త ప్రపంచంలోనికి ప్రేక్షకులను తీసుకువెళ్తాడు. అందుకే ఈయన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. కమలహాసన్‌తో విక్రమ్ సినిమా తీసిన తర్వాత లోకేష్ కనకరాజన్‌ క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ సినిమా తర్వాత లోకేష్‌ చేస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

ఇక లోకేష్‌ తీసిన సూపర్ హిట్ సినిమాల్లో ఖైదీ కూడా ఒకటి. ఈ సినిమా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. లోకేష్ కనగ‌రాజ‌న్‌ డైరెక్షన్లో తమిళ్ హీరో కార్తీ హీరోగా ఈ సినిమా రూపొందింది. తమిళ్, తెలుగు రెండు భాషల్లోనూ సెన్సేషనల్ హిట్గా నిలిచింది. మంచి కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కోసం మూవీ లవర్స్ అంతా ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ పై అంచనాలు కూడా ప్రేక్షకుల్లో బానే ఉన్నాయి. మరి తాజాగా లోకేష్ సినిమా సీక్వెల్ పై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ తో లియో సినిమా తెరకెక్కిస్తున్నాడు. అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ ఖైదీ సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. లియో రిలీజ్ తర్వాత లోకేష్ రజనీకాంత్ తో తలైవ‌ర్ 171 సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ కూడా పూర్తయ్యాక ఖైదీ సీక్వెల్ పార్ట్ చేస్తానని.. ఖైదీ సిరీస్ తనకు ఎంతో ప్రత్యేకమని.. తన సినిమాటిక్ యూనివర్స్ అంత మొదలైంది ఈ సినిమా నుండే అంటూ చెప్పుకొచ్చాడు. తనకున్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా సీక్వెల్ లేట్ అవుతుందని.. అయితే ఈ సినిమా ఖచ్చితంగా తీస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.