పూరి జగన్నాథ్ తన కొడుకుని ప‌ట్టించుకోక‌పోవ‌టానికి కార‌ణం ఇదేన‌ట‌..!!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లు ఒకరైన పూరి జగన్నాథ్.. ” బద్రి ” మొదలు రీసెంట్ గా వచ్చిన ” లైగర్ ” సినిమా వరకు హీరోలను మాస్ అవతారంలో చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఫ్లాప్ ట్రాక్ లో ఉన్న ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు అందరూ థియేటర్లలో క్యూ కడతారు. అలాంటి క్రేజ్ ఉన్న ఈయన సొంత కొడుకు ఆకాశ్ పూరిని మాత్రం పట్టించుకోవడం లేదని టాక్‌ వినిపిస్తుంది. అయితే వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే.. పూరి జగన్నాథ్ తన కొడుకుతో ఒక సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం.

దానికి సంబంధించిన కథ చర్చలు కూడా నడుస్తున్నాయని టాక్. ఇప్పటికే లైగర్ సినిమాతో డిజాస్టర్ చూసిన పూరి..” డబల్ ఇస్మార్ట్ ” కనుక హిట్ అయితే తన కొడుకుని పాన్ ఇండియా లెవెల్ లో చూపించడానికి ఫుల్ ప్లానింగ్ లో ఉన్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.