హాట్ యాంకర్ అనసూయ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో చిన్న క్యారెక్టర్ లో నటించిన ఈ బ్యూటీ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. తను నవ్వుతూ, అందరిని నవ్విస్తూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. మొదట రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రను పోషించిన అనసూయ ఈ సినిమాలో ఆమె పాత్ర కు మంచి మార్కులు పడడంతో తర్వాత పుష్ప సినిమాలో అవకాశం దక్కించుకుంది.
ఈ సినిమాతో మరింత సక్సస్ అందుకుంది. ఇక వరుస అవకాశాలు దక్కించుకున్న అనసూయ ఇటీవల పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. అలాగే ప్రభుదేవా వూల్ఫ్, సముద్రఖని కీలకపాత్రలో నటించిన విమానం ఇలా పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఈ భామ నంద్యాలలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ మెరిసింది. ఈ ఇవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనసూయ తన డ్యాన్స్ పర్ఫామెన్స్తో ప్రేక్షకులను మెప్పించింది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు క్యూ కట్టారు. అయితే జబర్దస్త్ మానేయడానికి అసలు కారణమేంటో ఈవెంట్లో రివిల్ చేసింది అనసూయ.
ప్రేక్షకులు తనని యాంకర్ గా చూస్తున్నారని నటిగా చూడడం లేదని ఉద్దేశంతోనే నేను జబర్దస్త్ మానేశానని.. ఈ ప్రోగ్రాంలో నవ్వుతూ ఉంటాను.. నవ్విస్తూ ఉంటాను.. సినిమాల విషయానికి వచ్చేసరికి సీరియస్ క్యారెక్టర్ చేస్తూ ఉంటాను. అలా ప్రేక్షకులు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే జబర్దస్త్ మానేశా అంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు లైఫ్ ఇచ్చింది మాత్రం జబర్దస్త్ అంటూ పేర్కొంది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింటే వైరల్ గా మారాయి.