మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఈ స్టార్ బ్యూటీస్.. వరుస ఆఫర్లతో బిజీ బిజీ..

ప్రస్తుతం హీరోయిన్లంతా కూడా ఫైటర్స్ అనిపించుకునే పనిలో ఉన్నారు. కెరీర్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇందులో ఇక కెరీర్ మొత్తం ముగిసింది అనుకున్న టైం లో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు ట్రెండింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అంటూ వచ్చేస్తున్నారు.

వారే సాయి పల్లవి, పూజా హెగ్డే. వీరిద్దరూ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. ఫైనల్‌గా ఈ వెయిటింగ్ కు పులిస్టాప్ పెట్టేసిన సాయి పల్లవి వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. తమిళ్ లో శివ కార్తికేయన్ సరసన నటిస్తోంది. అలాగే తెలుగులో నాగచైత‌న్య‌తో పాన్ ఇండియా మూవీకి కూడా సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అంతేకాదు బాలీవుడ్ మేకర్స్ రూపొందిస్తున్న రామాయణంలోనూ సీత పాత్రకు సాయి పల్లవిని పరిశీలిస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవి మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఇక పూజ విషయానికి వస్తే షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీతో పాటు మరో మూవీ తో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తుంది. మరి ఈ మూవీస్ తో మళ్లీ హిట్ అందుకుంటారో లేదో చూడాలి మరి.