టాలీవుడ్‌లో టాప్ – 5 భారీ బ‌డ్జెట్ సాంగ్స్ ఇవే..!

ఒక సినిమాకు కథ ఎంత ముఖ్యమో పాటలు కూడా అంతే ముఖ్యం. అందుకే దేశాలు, ఖండాలు దాటి పాటలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. మరి టాలీవుడ్ లో తెరకెక్కిన ఐదు ఎక్స్పెన్సివ్ సాంగ్స్ ఏవో చూద్దాం.

1. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ” బాహుబలి ” సినిమాలోని ” సాహోరే బాహుబలి ” సాంగ్ టాలీవుడ్ లోనే అత్యధికంగా ఖర్చు చేసిన పాట. కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్లో వందల మంది డ్యాన్సర్ లు పాల్గొనగా కేవలం ఈ పాట కోసమే రూ. 5 కోట్లు ఖర్చు చేశారట.

2. మహేష్ బాబు నటించిన ” భరత్ అనే నేను ” సినిమాలోని ” వచ్చాడయ్యో సామి ” సాంగ్ కోసం రూ. 2.5 కోట్లు ఖర్చు చేశారట మేకర్స్.

3. రామ్ చరణ్ హీరోగా నటించిన ” రంగస్థలం ” సినిమాలోని ” రంగమ్మ మంగమ్మ ” పాటను దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేయగా దీనికోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారట.

4. అల్లు అర్జున్ మూవీ ” నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ” లోని ” ఇరగ ఇరగ ” పాట‌ కోసం రూ. 1.5 కోట్లు ఖర్చు చేశారట.

5. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ” అల వైకుంఠపురములో ” సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ” రాములో రాములా ” సెట్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా రూ. 1.2 కోట్లు పెట్టారట.

6. రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా ” గేమ్ చేంజర్ ” సినిమాలోని ఒక పాట కోసం రూ. 15 కోట్లు ఖర్చు చేస్తున్నాడట దర్శకుడు శంకర్. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.